Breaking News

ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు గుడ్‌న్యూస్.. వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి

మార్చి 4 నేటి తెలుగు పత్రిక: ఏపీలో మద్యం కొనుగోలుదారులకు ఊరట కలిగించే నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొత్తగా ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ ప్రకారం అన్ని వైన్ షాపులు, బార్లలో డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి కానున్నాయి.


ఇక నుంచి ‘నో క్యాష్ ఓన్లీ’ పరిస్థితి ముగింపు

  • ప్రతి షాప్‌లో డిజిటల్ పేమెంట్ సదుపాయం ఉండాలి
  • కస్టమర్ డిజిటల్ పేమెంట్ చేస్తే తిరస్కరించడం కుదరదు
  • షాపులు, బార్లకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం అందించనుంది

ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో దాదాపు 30% వరకు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. కొత్త పాలసీతో దీనిని 60%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సొంత నిధులతో ఎకరం పొలాన్ని ఎస్సీ కుల స్మశానానికి కేటాయించిన పొన్నం బాలాజీ

నెల రోజుల్లో అమలు

ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఫైల్ సిద్ధం చేసింది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే పాలసీ అమల్లోకి రానుంది. అమలు తర్వాత అన్ని డిజిటల్ చెల్లింపులు రియల్ టైమ్‌లో ఎక్సైజ్ డేటాబేస్‌లో నమోదు అవుతాయి.


ట్రాక్ అండ్ ట్రేస్ విధానం

  • ప్రతి షాప్‌కు ప్రభుత్వం స్కానర్ అందజేస్తుంది
  • సీసా స్కాన్ చేసిన తర్వాతే విక్రయం
  • ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు పూర్తి డిజిటల్ ట్రాకింగ్

దీంతో మద్యం విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచిత ప్రయాణంపై కీలక అప్డేట్.. మహిళలకు మరిన్ని బస్సులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *