పామర్రు మార్చి 4 (నేటి తెలుగు పత్రిక ): బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారతాయని ప్రతి ఒక్కరు గ్రహించాలని పామర్రు ఐసిడిఎస్ సూపర్వైజర్ నూతక్కి సత్య శ్రీ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండని బాలిక, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేస్తే తల్లిదండ్రులు, పెద్దలు, మధ్యవర్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాభారతి బృందo వారిచే బాల్య వివాహాల నివారణ, మహిళలపై వేధింపుల నిరోధానికి చట్టాలపై అవగాహన అవసరమని వారి ప్రదర్శనల ద్వారా వివరించారు. కార్యక్రమంలో కళాజాత బృంద సభ్యులు వై. రవితేజ వీరయ్య, అంగన్వాడి టీచర్లు పద్మజా ప్రేమ్ కిరణ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
