Breaking News

ఉండవల్లి నివాసంలో లోకేష్ డిన్నర్ మీట్.. ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో సందడి

ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఈ విందుకు హాజరయ్యారు. ఫ్యామిలీ పార్టీలాగా సాగిన ఈ సమావేశంలో అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.డిన్నర్ మీట్‌కు వచ్చిన ప్రతి కుటుంబాన్ని లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ పేరుపేరునా పలకరించారు. అతిథులు అందించిన దేవుని ప్రతిమలను చెప్పులు తీసి భక్తితో స్వీకరించారు. చిన్నపిల్లలతో సరదాగా మాట్లాడి, వారు ఏం చదువుతున్నారని అడిగి కొంతసేపు ఆటలాడారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళామూర్తులకు మంగళగిరి పట్టుచీరలు అందజేసి లోకేష్ గౌరవించారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు, ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలపై వివరాలతో నివేదికను కూడా వారికి అందించారు.ఈ ఆత్మీయ సమావేశానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *