మంగళగిరి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, ఏపీ ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుని ఘనంగా సత్కారం పొందారు.ఈ ఏడాది “ఔషధ, సుగంధ మొక్కలు – ఆరోగ్యం, వారసత్వం, జీవనోపాధి పెంపొందించడం” అనే అంశంతో ఐక్యరాజ్యసమితి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఔషధ మొక్కల అభివృద్ధికి చేసిన సేవలకు గాను ఆవుల చంద్రశేఖర్ను సత్కరించారు.
