Breaking News

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు” అనే సామెతతో విమర్శలు చేసిన మదిగాని…!

విజయవాడ. మార్చి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయం అని విమర్శించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను ఉద్దేశించి “ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు” అనే సామెతతో విమర్శలు చేశారు. ఆయనకు పద్ధతి లేదని, స్వార్థ రాజకీయాల కోసం దైవ కార్యక్రమాలను కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయం లో మాదిగాని గురునాధం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేసంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. హిందూ ధర్మం పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రశంసిస్తూ, ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతల్లో అభివృద్ధి కుంటుపడిందని, రౌడీయిజం పెరిగిపోయిందని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్లను మార్చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని విమర్శించారు. రక్తం కూడు తింటూ రక్త చరిత్ర కలిగిన వారు” అంటూ వైసిపి నాయకుల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా దందాలు, హత్యలకు పాల్పడుతున్న వారికి నీతులు చెప్పే అర్హత లేదని అన్నారు. వైసిపి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి,డాక్టర్.విశ్వనాధం,ఆనంద్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *