Breaking News

అమిత్ షాతో సీఎం రేవంత్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం

నేటి తెలుగు పత్రిక: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, SIB ఐజీ సుమతి కూడా పాల్గొన్నారు.రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రికి నివేదిక అందించారు. మావోయిస్టులపై కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కు తెలంగాణ పోలీసులు సహకరించిన విధానాన్ని అమిత్ షా ప్రశంసించారు.ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇదే విధంగా సహకారం కొనసాగించాలని అమిత్ షా సూచించారు. అలాగే మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *