నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జగన్ బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. బెంగళూరుకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉండనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
