Breaking News

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్‌లో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తలసన్ ఐ శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, లక్ష్మా రెడ్డి, కాలేరు వెంకటేష్ కూడా హాజరయ్యారు.ఇక ఎమ్మెల్సీ సురభి వాణితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఈ సందర్శనలో పాల్గొన్నారు. ప్లాంట్ నిర్వహణ, నగరంలోని మురుగు నీటి శుద్ధి ప్రక్రియపై కేటీఆర్ అధికారులతో చర్చించారు.

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

అమిత్ షాతో సీఎం రేవంత్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *