Breaking News

ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను నూరు శాతం అధికమించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులదే : జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో సుబ్బారావు

పామర్రు, మార్చి05( నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే, ఇతర క్షేత్రస్థాయి సర్వేలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని పామర్రు జి ఎస్ డబ్ల్యూ ఓ డిప్యూటీఎంపీడీవో బొమ్మసాని సుబ్బారావు అన్నారు. గురువారం పామర్రు పట్టణంలోని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ,యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, హౌసింగ్, ఇతర ప్రభుత్వ సర్వేలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాన్నారు. సర్వేలు పూర్తి చేయని సిబ్బంది వేతనాలు నిలుపుదల చేస్తామని, నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని సచివాలయ ఉద్యోగులను ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు వేతనాలు నిలుపుదల కాకుండా ఉండాలంటే, సర్వేలను వంద శాతం పూర్తి చేసి, ఆన్‌లైన్ యాప్‌లో సకాలంలో సమర్పించాలని సూచించారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. సర్వేలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వేగవంతానికి ఆదేశాలు

జనగణన నమోదు తోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు జనగణన సర్వే ఎంతో కీలకం : పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *