Breaking News

రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేం దుకు ఆంధ్రప్రదేశ్ మోటా రు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026ను రవాణా, యువ జన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రిజిస్ట్రేషన్ సమ యంలో జీవితకాల పన్ను చెల్లించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రతా సెస్సు విధించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సచివాల యం అసెంబ్లీ సమావేశం లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిల్లు ను ప్రవేశపెట్టి నిధులను రహదారి భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లాక్‌ స్పాట్ల మెరుగుదల, ప్రమాదాల తగ్గింపుకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెస్సుతో రాష్ట్రానికి నెలకు సుమా రు రూ.22.5 కోట్లు, సంవ త్సరానికి రూ.270 కోట్లు ఆదాయం వచ్చే అవకా శం ఉందని మంత్రి రామ్ ప్రసాద్ వెల్లడించారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *