ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్ కుటుంబ సభ్యులను లోకేష్ దంపతులు కలుసుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, క్రీడా మరియు సినీ రంగాలకు చెందిన అతిథులు కూడా హాజరయ్యారు.



