హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నట్లు భావించి రక్షణ బృందాలు శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
