నేటి తెలుగు పత్రిక: అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంను సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఖమేనీ మరణంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఫిబ్రవరి 28న తెహ్రాన్పై జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు సమాచారం. 1989 నుంచి ఆయన ఇరాన్కు అత్యున్నత రాజకీయ, మత నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ దాడిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల నేతలతో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు. హైథమ్ బిన్ తారిక్ (ఒమన్ సుల్తాన్), షేఖ్ సబాహ్ అల్-ఖాలిద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాహ్ (కువైట్ యువరాజు), అలాగే షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ (ఖతార్ అమీర్)లతో ఫోన్లో మాట్లాడి ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు.గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ ఆయా దేశాల నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది.
