యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి గురువారం వచ్చిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్ హోదాలో తొలిసారిగా వచ్చిన అనురాగ్ జయంతిని మున్సిపల్ ప్రజల పక్షాన చైర్మన్ శాలువాతో సత్కరించారు. తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
