Breaking News

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కనితే రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి ,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR)పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 శాతంగా ఉన్న TFRను 2.1 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని తీసుకురానుంది. రెండో బిడ్డతో పాటు ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు డెలివరీ సమయంలో రూ.25,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఈ చర్య ద్వారా కుటుంబాలు ఎక్కువ పిల్లలను కనేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణి

ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *