విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ చైర్మన్ రవి నాయు డుని వాటర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యులు ప్రదీప్ నాయుడు మర్యాదపర్వకంగా కలిసి, మే 2026లో రాజమహేంద్రవరం లో నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ క్రీడా పోటీలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా విజయవాడ శాప్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఈ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రపంచంలోని 25కు పైగా దేశాల నుండి సుమారు 1800 మంది క్రీడాకారులు, అధకారులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, జిల్లా పరిపాలన సహకారంతో నిర్వహించనున్నట్లు వారుతెలిపారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించడం క్రీడల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

