Breaking News

అమృత్ స్టేషన్ పథకంతో కర్నూలు రైల్వే స్టేషన్‌కు నూతన రూపం.. వేగంగా అభివృద్ధి పనులు

కర్నూలు, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం పథకం కింద కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇప్పటికే ప్లాట్‌ఫామ్ విస్తరణతో పాటు ప్లాట్‌ఫామ్-1 ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. స్టేషన్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ప్రధాన ప్రవేశ ద్వారం (Main Entry Facade) నిర్మాణం, రెండో ప్రవేశ ద్వారం (2nd Entry), ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) ఫౌండేషన్, అలాగే పార్కింగ్ షెడ్స్ నిర్మాణం ఉన్నాయి.ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందనుంది. నూతన భారత్ నిర్మాణంలో భాగంగా రైల్వే మౌలిక వసతులను ఆధునికీకరించే దిశగా కర్నూలు రైల్వే స్టేషన్ మరో ముందడుగు వేస్తోంది.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *