Breaking News

ఎంపీ వద్దిరాజు మనుమరాలు తారుణి అన్నప్రాసన మహోత్సవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది

హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మనుమరాలు అన్నప్రాసన మహోత్సవం శుక్రవారం ఉదయం జరిగింది. రవిచంద్ర-విజయలక్మీ దంపతుల కుమారుడు నిఖిల్ చంద్ర-అనీల దంపతుల చిన్న కూతురు తారుణి అన్నప్రాసన కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది.వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన ఈ మహోత్సవంలో తారుణి మేనత్త డాక్టర్ గంగుల గంగాభవాని, అమ్మమ్మ రేవతిపద్మ, మేనమామ-అత్తయ్య వరుణ్-సాగరిక,పిన్ని-బాబాయ్ డాక్టర్ గాయత్రి-రాము,అక్క సహశ్రిక తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారిని శాలువాలతో సత్కరించి ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

వేసవి వేడిలో చలివేంద్రం.. ప్రజల దాహం తీర్చే సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *