హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మనుమరాలు అన్నప్రాసన మహోత్సవం శుక్రవారం ఉదయం జరిగింది. రవిచంద్ర-విజయలక్మీ దంపతుల కుమారుడు నిఖిల్ చంద్ర-అనీల దంపతుల చిన్న కూతురు తారుణి అన్నప్రాసన కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది.వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన ఈ మహోత్సవంలో తారుణి మేనత్త డాక్టర్ గంగుల గంగాభవాని, అమ్మమ్మ రేవతిపద్మ, మేనమామ-అత్తయ్య వరుణ్-సాగరిక,పిన్ని-బాబాయ్ డాక్టర్ గాయత్రి-రాము,అక్క సహశ్రిక తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారిని శాలువాలతో సత్కరించి ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.





