విజయవాడ, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైంది.ఉదయం కలశ ఊరేగింపు, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరిగింది.ఈ వేడుకల్లో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో సీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.మార్చి 8న ఉదయం 9:34 గంటలకు ప్రధాన కుంభాభిషేకం జరగనుంది.
