Breaking News

ఇంద్రకీలాద్రికి కాంచీ పీఠాధిపతి రాక.. సాయంత్రం 6 గంటలకు దుర్గమ్మ దర్శనం

విజయవాడ, మార్చి 6, 2026, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు నేడు విజయవాడకు రానున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా స్వామి వారి పర్యటన జరుగుతోంది.స్వామివారు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ చేరుకోనుండగా, ప్రకాశం బ్యారేజీ వద్ద ఆలయ అధికారులు మరియు వేద పండితులు ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. సీనా నాయక్ తదితరులు వైదిక లాంఛనాలతో స్వామి వారిని ఇంద్రకీలాద్రికి తీసుకువెళతారు.సాయంత్రం 6 గంటలకు స్వామివారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *