విజయవాడ, మార్చి 6, 2026, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు నేడు విజయవాడకు రానున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా స్వామి వారి పర్యటన జరుగుతోంది.స్వామివారు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ చేరుకోనుండగా, ప్రకాశం బ్యారేజీ వద్ద ఆలయ అధికారులు మరియు వేద పండితులు ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. సీనా నాయక్ తదితరులు వైదిక లాంఛనాలతో స్వామి వారిని ఇంద్రకీలాద్రికి తీసుకువెళతారు.సాయంత్రం 6 గంటలకు స్వామివారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
