హైదరాబాద్,మార్చి 6, 2026,నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా ను నియమించింది. త్వరలోనే ఆయన తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ మార్పులు కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా మహారాష్ట్ర, ఢిల్లీతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నర్ల స్థానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టనున్నారు.దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థలో ఈ మార్పులు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగా జరిగాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
