Breaking News

నిబంధనలు ఉల్లంఘి స్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే

విజయవాడ. మార్చి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టు లో 8వ అదనపు జ్యుడీ షియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శాని టరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 17 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 8,410/- రూపాయలు జరిమానా విధించారు. మరోసారి మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్లపై మాట్లాడుతూ చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని మొబైల్ కోర్ట్ జడ్జి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్స్ సలీం మహమ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్ర నాథ్, జైపాల్, యేసు రత్నం, పి. హేమంత్ కుమార్, మేరుగా రాజేష్, బుజ్జి బాబు, గోపిరాజు, తదితరులు పాల్గొన్నరు.

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

రవాణా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవల దిశగా మరో అడుగు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *