మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో పెంచిన కరెంట్ ఛార్జీలను ఇప్పటికే తగ్గించినట్లు ఆయన తెలిపారు.ట్రూ-అప్ చార్జీల భారాన్ని తొలగించి, ట్రూ-డౌన్ చార్జీల కింద ఒక్కో యూనిట్కు 13 పైసలు తగ్గించినట్లు సీఎం వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై సుమారు ₹4,498 కోట్ల విద్యుత్ భారం తగ్గిందని చెప్పారు.అలాగే భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇప్పటికే ఒక లక్ష ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఏప్రిల్, మే నెలల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఇలా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలను మరింతగా తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
