Breaking News

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విస్సన్నపేట మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): విసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో శుక్రవారం అందజేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అంతకుముందు విస్సన్నపేటలో మ్యాంగో మార్కెట్ యార్డును ప్రారంభించారు. విసన్నపేట మండలం పుట్రెల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఈ వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు రెండు ఆర్ఓ ప్లాంట్లు కావాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్ వాటి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకుడు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *