Breaking News

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో శుక్రవారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం శివాలయం వీధిలో ప్రారంభమైంది. మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమాన్ని అంశాల వారీగా ఈ సందర్భంగా కమీషనర్ ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వివరించారు. మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, కౌన్సిలర్లు కోమల్ల మౌనిక హరీష్, యాట శివ, వానరాసి మరియమ్మ మార్క్, బీజని కళ్యాణి మధు, పాశికంటి సంపత్, బొట్ల సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, జెట్ట నీరజ సిద్ధులు తో పాటు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. శివాలయం వీధిలో మురుగు కాలువలను మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచారు.

హామీలు నెరవేర్చాలి.. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి: డా. కొండ దేవయ్య పటేల్

గల్లీ నుంచి ఢిల్లీ వరకు హక్కుల కోసం పోరాటం చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *