Mar 07,నేటి తెలుగు పత్రిక: మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు తీసుకోవలసిన కార్యాచరణ నిమిత్తం ఈనెల 15న ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్నూరు కాపు ఫౌండేషన్ నిర్ణయించింది. ఫౌండేషన్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షత జరిగే ఈ సమావేశానికిగ్రామ, మండల,జిల్లా, రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్ అయి ఉండి కులానికి సేవ చేస్తున్న మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి రావలసిందిగా మనవి, ట్రస్ట్ బోర్డుల చైర్మన్లు, ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నాయకులు ప్రభుత్వ,ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపార వాణిజ్య వేత్తలు ఈ సమావేశానికి హాజరై భవన నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణ నిమిత్తం తగు సూచనలు సలహాలు అందించి ఆర్థిక వనరుల సేకరణకు మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందిగా విజ్ఞప్తి.
