Breaking News

జనాభా భారం కాదు… భాగ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి,mar 07,నేటి తెలుగు పత్రిక: అమరావతిలో జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఫ్యామిలీ ప్లానింగ్‌పై దృష్టి పెట్టినా ఇకపై “పాపులేషన్ కేర్” వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు.


ముఖ్య లక్ష్యం

  • ప్రస్తుతం ఏపీలో టోటల్ ఫెర్టిలిటీ రేటు (TFR) – 1.5
  • ప్రభుత్వ లక్ష్యం: 2.1కి పెంచడం
  • లేకపోతే భవిష్యత్తులో వర్క్ ఫోర్స్ తగ్గే ప్రమాదం ఉందని సీఎం తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన నిర్ణయాలు

పిల్లల పెంపకం ప్రోత్సాహం

  • మూడో సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం
  • 5 సంవత్సరాలపాటు నెలకు ₹1,000 పోషణ సాయం
  • 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య
  • మూడో సంతానానికి 12 నెలల పేరెంటల్ లీవ్
  • తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్

ఆరోగ్య సేవలు

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF ఫెర్టిలిటీ సెంటర్లు
  • గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రభుత్వ మద్దతు
  • టీనేజ్ గర్భధారణలను 8.8% నుంచి 3%లోపు తగ్గించడం

మహిళల సంక్షేమం

  • రాష్ట్రంలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు
  • చైల్డ్ కేర్ సెంటర్లు
  • పింక్ టాయిలెట్లు
  • మహిళలకు ప్రత్యేక షీ క్యాబ్స్

ప్రత్యేక కార్యక్రమాలు

  • ప్రతి నెల నాలుగో శనివారం “పాపులేషన్ కేర్” కార్యక్రమం
  • నెలపాటు ప్రజాభిప్రాయ సేకరణ
  • ఏప్రిల్ 1 నుంచి పాలసీ అమలు

ఐదు కీలక స్తంభాలు (Five Pillars)

సీఎం ప్రకటించిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఐదు అంశాలపై ఆధారపడుతుంది:

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్‌లో రూ.లక్ష జమ!
  1. మాతృత్వం
  2. శక్తి
  3. క్షేమం
  4. నైపుణ్యం
  5. సంజీవని

భవిష్యత్ అంచనా

  • 2047 నాటికి రాష్ట్రంలో 23% జనాభా వృద్ధులు అయ్యే అవకాశం
  • దీనికోసం ప్రతి జిల్లాలో వృద్ధుల సంరక్షణ వార్డులు
  • సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా రిటైర్డ్ ప్రొఫెషనల్స్ సేవలు

కొత్త నినాదం

సీఎం ప్రకటించిన నినాదం:“ఒక్కరు వద్దు – ఇద్దరు ఒకే – ముగ్గురు ముద్దు”


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *