Breaking News

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

Mar 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర, వారి సాధికారతపై ఆయన ప్రత్యేక సందేశం విడుదల చేశారు.గవర్నర్ తన సందేశంలో మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలు స్వాతంత్ర్య ఉద్యమం నుండి ఇప్పటి వరకు జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడడంలో గొప్ప పాత్ర పోషించారని పేర్కొన్నారు. సమాజానికి మహిళలు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు.

గుంటూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

సమాజం, రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మహిళల విజయాలను గుర్తించి వెలుగులోకి తీసుకురావడానికి అలాగే సమానత్వం, న్యాయం, గౌరవం కోసం మహిళల హక్కులపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను జరుపుకుంటామని తెలిపారు.మన సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, జాతి నిర్మాణంలో మహిళలు కీలక నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. సహనం, పట్టుదలతో అనేక బాధ్యతలను మోస్తూ సమాజ అభివృద్ధికి మహిళలు విశేషంగా తోడ్పడుతున్నారని ఆయన ప్రశంసించారు. మహిళల ఈ ప్రత్యేక శక్తి దేవుడు ఇచ్చిన వరమని కూడా గవర్నర్ పేర్కొన్నారు.

అనకాపల్లి మరో రంగారెడ్డి కానుండి.. భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుంది: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *