మార్చి 7(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో సదస్సు నిర్వహించారు. నగరంలోని Fortune Murali Parkలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి (సరిత) ప్రెస్మీట్ నిర్వహించి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతులకు, సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పాటించిన ఆహారపు అలవాట్లలో నవధాన్యాలు, చిరుధాన్యాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆహార భద్రతకు, ఆరోగ్యకర జీవనశైలికి ఆర్గానిక్ వ్యవసాయం ఎంతో అవసరమని వివరించారు.
రైతు దేశానికి వెన్నుముక అని, దేశాన్ని కాపాడే సైనికులతో పాటు రైతులను కూడా సమాజం గౌరవించాలని మంత్రి పిలుపునిచ్చారు. పంట నష్టం జరిగినా తిరిగి కష్టపడి పంటలు పండించే రైతులకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని అన్నారు.ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ వంటి వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణం రసాయనాలు, క్రిమిసంహారక మందులతో పండించిన ఆహారమేనని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.ఆధునిక కాలంలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంబిస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని, రైతులకు తోడ్పాటునందించాలని మంత్రి సరిత పిలుపునిచ్చారు.
