యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, దాతరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదవ తరగతి ఎస్.ఎస్.సి 200 మంది విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శరద్ యామిని గారి సమక్షంలో కోమటిరెడ్డి యువసేన రాష్ట్రనాయకులు దార నవీన్ గారి అద్వర్యంలో పరీక్ష ప్యాడ్ జమేటరీ బాక్స్, పెన్నులు పంపిణి చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో కాటబత్తిని శ్రీనివాస్, వేముల నర్సింహా, డంగు నీరజ్, భాస్కర్, బబ్బి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
