Breaking News

ఏం.ఆర్.ఓ ఆఫీసు ముందు బి.ఆర్.ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

  • నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేయాలి.
  • నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేసి కాంగ్రెస్ నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు.

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ పరిధిలోగల ఇందిరా కాలనీ బీసీ కాలనీ యాదగిరిపల్లి జంగాల కాలనీ మరియు యాదగిరిపల్లి బీసీ కాలనీ లోగల సుమారు 762 ఇళ్ళను నిషేధిత జాబితాలో చేర్చి నిరుపేద కుటుంబాలను ఇబ్బంది పెడుతున విధానాలకు నిరసనగా ఈరోజు యాదగిరిగుట్ట ఏం.ఆర్.ఓ ఆఫీసు ముందు బి.ఆర్.ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బి.ఆర్.ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున పేద ప్రజలకు ఏమి వర్గ పెటలేదు అని హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చడం తప్ప ఏమి చేయలేదుఅని ఆరోపించారు. ఇప్పటి కయినా నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను పది రోజుల వెవధిలో రెగ్యులగారిస్ చేసి కాంగ్రెస్ నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 762 ఇళ్ల బాధితులతో ఆలేరు ఎమ్మెల్యే గారి ఇల్లును ముట్టడిస్తం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అరె శ్రీధర్ యూత్ అధ్యక్షులు ముక్రెల సతీష్ , సతీష్ భాట్, సరషి రాజేష్, రకాల రాజు, మాటూరి బాలయ్య, కంసాని స్వామి, చిరంజీవి, సర్దార్, మోతె బాల్ నరసింహ, మిట్ట వెంకటేశ్, దాసరి బాల గురువేయ వీరి తో పాటు ఇళ్ల బాధితులు దుర్గ పతి కృషి, మిట్ట బాల్రామ్, మచ్చ సామేయా మిట్ట లక్ష్మి నారాయణ, నాగపురి శ్రీను గౌట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పామర్రు లో ఆపరేషన్‌ ‘వజ్ర ప్రహార్‌’

దేవాదాయ శాఖ కు ఐఏఎస్ కమిషనర్ ను నియమించాలి: వేల్పూరి శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *