నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.నామినేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఇతర అభ్యర్థులు లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు.నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు.
