Breaking News

టీ20 వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియాకు సీఎం రేవంత్ అభినందనలు

నేటి తెలుగు పత్రిక,mar 09: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జాతీయ క్రికెట్ జట్టు కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ – న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

యాదగిరిగుట్ట పట్టణంలో 5K రన్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారత జట్టు సాధించిన విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు జట్టు సమన్వయంతో, ధైర్యసాహసాలతో ఆడి అద్భుత ప్రదర్శన చూపిందని ప్రశంసించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచారని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. ఈ విజయం భారత క్రీడా రంగానికి మరింత గౌరవం తీసుకొచ్చిందని సీఎం పేర్కొన్నారు.టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు జట్టు సభ్యులందరికీ ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు, నష్టపరిహారం ఇవ్వాలి: ప్రజా సంఘాల డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *