నేటి తెలుగు పత్రిక,mar 09: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి బృందాలు ఒక ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టిన ఘటనగా నిలిచింది. పోలీసుల సహాయంతో ఆమెకు రక్షణ లభించగా, అనంతరం ప్రభుత్వ మద్దతుతో విద్య పూర్తి చేసి ఉద్యోగం సాధించింది.తాజాగా నిర్వహించిన AP DSCలో ఆమెకు ఉద్యోగం లభించి టీచర్గా స్థిరపడింది. దీంతో ఆమె జీవితం కొత్త దిశలో ముందుకు సాగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక ప్రాణాన్ని కాపాడితే, ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ద్వారా ఆమెకు టీచర్ ఉద్యోగం లభించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి పౌరుడిని సొంత బిడ్డలా చూసుకుంటూ సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
