Breaking News

మహిళల ఆర్థిక సాధికారతకు 36 ఒప్పందాలు.. అమరావతిలో సెర్ప్, మెప్మా కీలక నిర్ణయం

అమరావతి,mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక అడుగు పడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం మరియు మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు మిషన్ సంస్థలు వివిధ రంగాలకు చెందిన సంస్థలతో మొత్తం 36 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాలు స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కుదిరాయి. మహిళా మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక మద్దతు వంటి అంశాల్లో ఈ ఒప్పందాలు దోహదం చేయనున్నాయి.

పంచాయతీరాజ్ శాఖలో సంచలన మార్పులు.. గ్రామాభివృద్ధిలో కొత్త అధ్యాయం

మిల్లెట్స్, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, సీవీడ్ సాగు, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, డిజిటల్ వ్యాపారాలు వంటి పలు రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఈ భాగస్వామ్యాలు కుదిరాయి. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” లక్ష్యంతో గ్రామీణ, పట్టణ మహిళలను ఆర్థికంగా బలపర్చడమే ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

పవన్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం.. నాగబాబు ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *