Mar 09, నేటి తెలుగు పత్రిక: దేశంలో ప్రతి పౌరుడికి ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉన్న Aadhaar కార్డు అప్డేట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి తప్పనిసరిగా సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.Unique Identification Authority of India అందించిన కొత్త ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు సులభంగా మొబైల్ నెంబర్ను మార్చుకోవచ్చు. ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ వంటి సేవల కోసం ఇది తప్పనిసరి.
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసే విధానం:
- మొబైల్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి
- ఆధార్ వెరిఫికేషన్తో లాగిన్ కావాలి
- హోమ్ పేజీలో “సర్వీసెస్” ట్యాబ్పై క్లిక్ చేయాలి
- “అప్డేట్ మొబైల్ నెంబర్” ఆప్షన్ ఎంచుకోవాలి
- కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేయాలి
- వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి
- ఆన్లైన్లో సర్వీస్ ఛార్జీ చెల్లించాలి
ఈ ప్రక్రియ పూర్తయ్యాక 10 నుంచి 15 రోజుల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నెలరోజుల వరకు సమయం పట్టవచ్చు.
సర్వీస్ ఛార్జీ:
మొబైల్ నెంబర్ లేదా చిరునామా అప్డేట్ కోసం రూ.75 సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్డేట్ పూర్తైన తర్వాత కొత్త మొబైల్ నెంబర్కు మెస్సేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
