కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా.
యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా లోని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి కలిసి వినతిపత్రం అందజేసిన తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా.ఈ సందర్భంగా వారు కలెక్టర్ కు జిల్లాలోని పలు సమస్యలైన ఇండ్ల స్థలాల సమస్యలను మరియు ఇందిరమ్మ పథకంలో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.వారితోపాటు టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు గట్టి కొప్పుల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
