Breaking News

విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు: గద్దె క్రాంతి కుమార్

విజయవాడ. మార్చి 9 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిల్యాండ్ జట్టుపై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి మూడోసా రి టీ-20 ప్రపంచకప్‌ను భారతదేశానికి అందించిన టీమ్ ఇండియా జట్టు కు గద్దె క్రాంతి కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సోమవారం ఉదయం అశోక్ నగర్‌లోని ఇంటి వద్ద తన కుమార్తె రానియతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శిస్తూ టీమ్ ఇండియా విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శించిన అద్భుతమైన ఆటతీరు, జట్టు సమిష్టి కృషి ప్రతి భారతీయుడు గర్వకారణంగా భావిస్తున్నారన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థ నాయకత్వంలో బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అందరూ సమన్వయంతో రాణించి ఈ అద్భుత విజయాన్ని సాధించారని కొనియాడారు. టీ-20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం నుండి వరుస విజయాలతో ముందుకు సాగిన భారత జట్టు ఫైనల్‌లో కూడా అదే పట్టుదల, జట్టు స్పూర్తితో ఆడి ఘన విజయం సాధించడం దేశ ప్రజలకు అపార ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఇలాంటి మరెన్నో విజయాలతో భారత క్రికెట్ జట్టు ప్రపంచ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టలను మరింత గా నిలబెడుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జట్టు సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు

నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *