నంద్యాల,Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లా లోని ధోన్ నియోజకవర్గం, కొత్తబురుజు లో పర్యటించారు.ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సీఎం సందర్శించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు.తర్వాత నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.
