కోదాడ/ మేళ్లచెరువు: మార్చ్10( నేటి తెలుగు పత్రిక): టీఎస్ యుటిఎఫ్ మేళ్లచెరువు కేజీబీవీ, యు ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, ఉపాధ్యాయుల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, మొదటి దశ పోరాటంలో భాగంగా కేజీబీవీ మేళ్లచెరువు పాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. సమ్మె కాలంలో 29 రోజుల వేతనం మంజూరు చేయాలని, అదేవిధంగా రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు మినిమం టైమ్ స్కేల్ మంజూరు చేయాలని, హెల్త్ కార్డు మంజూరు చేయాలని, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న క్రాఫ్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేళ్లచెరువు మండల అధ్యక్షులు శ్రీరంగరాజు ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఎస్ ఓ హరిత IERP అర్వపల్లి బోధన సిబ్బంది విజయ, పరమేశ్వరి, ఉష,లక్ష్మి బోధినేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
