నేటి తెలుగు పత్రిక,mar 10: వేసవి కాలం మొదలవుతున్న కొద్దీ ఇళ్లలో, ఆఫీసుల్లో Air Conditioner వినియోగం పెరుగుతోంది. అయితే ఏసీని సరిగా ఉపయోగించకపోతే పరికరం దెబ్బతినడంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సాధారణ తప్పులు చేయకుండా జాగ్రత్తపడితే ఏసీ ఎక్కువ కాలం పనిచేయడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది.
రెగ్యులర్ సర్వీస్ తప్పనిసరి
ఏసీ సరిగ్గా పనిచేయాలంటే క్రమం తప్పకుండా సర్వీస్ చేయించడం చాలా అవసరం. ఫిల్టర్పై మురికి పేరుకుపోతే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. దీని వల్ల కంప్రెసర్పై ఒత్తిడి పెరిగి ఏసీ పనితీరు తగ్గిపోతుంది.
ఫిల్టర్లను మార్చడం మర్చిపోవద్దు
చాలామంది సంవత్సరాల పాటు అదే ఫిల్టర్ను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫిల్టర్ మూసుకుపోయి గాలి సరఫరా తగ్గిపోతుంది. దీంతో ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుంది.
ఉష్ణోగ్రత చాలా తక్కువగా పెట్టొద్దు
చాలామంది ఏసీ టెంపరేచర్ను చాలా తక్కువగా ఉంచుతారు. ఇది ఏసీపై అదనపు భారం పెంచుతుంది. సాధారణంగా 22–24 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంచితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి
ఏసీ నడుస్తున్నప్పుడు గదిలోని తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే చల్లదనం బయటకు వెళ్లిపోతుంది. దీంతో గది చల్లబడేందుకు ఏసీ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. ఇది పరికరంపై ఒత్తిడి పెంచడంతో పాటు విద్యుత్ బిల్లును కూడా పెంచుతుంది.
ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఏసీ పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యుత్ ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.
