నేటి తెలుగు పత్రిక,Mar 10: తెలంగాణకు నూతన గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిన వారిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గవర్నర్కు శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం తెలిపారు.
