Breaking News

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు * పోసన బోయిన హుస్సేన్

విద్యుత్ ఉద్యోగుల నిరసన

సూర్యాపేట/హుజూర్నగర్ : మార్చి 10(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై రూ. 60 ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోసన బోయిన. హుస్సేన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హుజూర్నగర్ మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ 60 కి పెరిగింది అదే వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధర రూ116 పెరిగింది చమురు నిల వలు తగ్గితే ఇరాన్ నుంచే చెమరు దిగుమతికి ఆటంకాలు కొనసాగితే పెట్రోల్ డీజిల్ ధరలు అగ్గిపుల్ల లేకుండానే మండిపోతాయి అమెరికాకు తల్లోగ్గి రష్యా నుంచి దిగుమతులు నిలిపివేసిన పర్యవసన ఫలితమిది దీని మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలం నుండి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరను ఇష్టానుసారం పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ధరల మీద ధరల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గ్యాస్ బండ మోపటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రభుత్వ గ్యాస్ వినియోగాన్ని పక్కన పెట్టి మళ్లీ కట్టెల కువైపు నెట్టటానికి ఉపయోగపడుతుందన్నారు పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల. వెంకటచంద్ర శాఖ కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు తంగేళ్ల. గోపరాజు మాడూరి. నరసింహ చారి నూకల. లక్ష్మీనరసింహ కృష్ణారావు పారుపల్లి.శీను తేలూరి శీను జింకల. గోపి శాఖమూరి. కృష్ణమూర్తి కట్ట. చిన్న గోపాలరావు బిందు. చిట్టెమ్మ లక్ష్మమ్మ సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *