Breaking News

ప్రభుత్వంపై బురదజల్లడమే వైసీపీ లక్ష్యం: మంత్రి పార్థసారథి

నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.వైసీపీ పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఒకలా ఉండగా, ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వారసత్వంగా రాష్ట్రంపై దాదాపు రూ.9 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ఆయన అన్నారు.ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అయినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు.

సచివాలయంలో సీఆర్డీఏ 59వ అథారిటీ సమావేశం.. భూ కేటాయింపులు, కన్వెన్షన్ సెంటర్‌పై చర్చ

నులకపేటలో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభం.. మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *