Breaking News

క్రాంతి నగర్ సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రం అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజున ఆలేరు మున్సిపల్ పరిధిలోని క్రాంతి నగర్ లో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమని భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరెడ్డి 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి కాలనీవాసులు తమ ప్రాంత సమస్యలపై చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ ప్ర్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని మురుగు కాలువల నిర్వహణ లేకపోవడం వలన పలు కాలనీలలో మురుగు నిలబడి బురదగుంటలుగా తయారయ్యాయి పందులు స్వైర విహారం చేస్తున్నాయి, దోమల బారిన పడి విష జ్వరాలతో కాలనీలోని అనేక మంది ‘కుటుంబాలు ఆసుపత్రిపాలై అవస్థలు పడుతున్నారు, కావున ఇక్కడ సమస్యలు మీరు గుర్తించి ఈ కాలనీకు సరిపడు సిసి రోడ్లు ములుగు కాలువలు వీధిలైట్లు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి పందుల సమస్యను అదేవిధంగా కోతుల బెడద కావున ఇక్కడ సమస్యలు మీరు గుర్తించి త్వరలో పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ లు పాషీ కంటి సంపత్ , జూకంటి సంపత్, పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల నిరసన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *