మార్చి 10 : (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వెలుగుమట్ల భూదాన్ భూములలోనే ఇండ్ల పట్టాలి ఇచ్చి ప్రభుత్వం ఇల్లు నిర్మించాలి. నష్టపోయిన కూల్చివేత గురైన ఇల్లు అంచనా వేసి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలి. తాత్కాలిక జీవనం కోసం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో భూదాన్ భూమి ఇళ్ల స్థలాల నిర్వాసితులకు మద్దతుగా నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


