Breaking News

గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఘనంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

నేటి తెలుగు పత్రిక,mar 10: గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జనసేన పార్ట్y ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు నర్రెడ్ల అమ్మినాయుడు ఆధ్వర్యంలో, పట్టణ కార్యదర్శి బోడాల ఆశోక్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా మాజీ అడిషనల్ ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పాలడుగు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

ఈ సందర్భంగా అమ్మినాయుడు మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని తెలిపారు. చివరి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోడాల ఆశోక్ మిత్రబృందం ద్వారా సుమారు 100 ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు సైదావలి, తోట రామకోటేశ్వరరావు, కొండవీటి శ్రీనివాసరావు, ఆరణి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *