నేటి తెలుగు పత్రిక,mar 10: గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జనసేన పార్ట్y ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు నర్రెడ్ల అమ్మినాయుడు ఆధ్వర్యంలో, పట్టణ కార్యదర్శి బోడాల ఆశోక్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా మాజీ అడిషనల్ ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పాలడుగు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమ్మినాయుడు మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని తెలిపారు. చివరి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోడాల ఆశోక్ మిత్రబృందం ద్వారా సుమారు 100 ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు సైదావలి, తోట రామకోటేశ్వరరావు, కొండవీటి శ్రీనివాసరావు, ఆరణి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



