Breaking News

పేద బీటెక్ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేసిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ. మార్చి 10 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ల్యాప్‌టాప్ లేక ఇబ్బంది పడుతున్న నీరుడు కుందన్ కుమార్ పరిస్థితిని స్థానిక డివిజన్ నాయకులు గద్దె రామ మోహన్ దృష్టికి తీసుకెళ్లారని దీనిపై స్పందించిన గద్దె రామమోహన్ విద్యార్థికి లాప్ ట్యాప్ ఇవ్వాలని గద్దె క్రాంతి కుమార్ కి ఆదేశించడంతో మంగళవారం ఉదయం 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గద్దె క్రాంతికుమార్ సదరు విద్యార్థుకి ల్యాప్ ట్యాప్ అందజేశారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతున్న నేపథ్యం లో పేద విద్యార్థులు ఇబ్బందులు పడకూడ దనే ఉద్దేశంతో బీటెక్ విద్యార్థి నీరుడు కుందన్ కుమార్‌కు సొంత నిధుల తో ల్యాప్‌టాప్ అందజే యడం జరిగిందన్నారు. ప్రస్తుత కాలంలో విద్యలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమైందని, పేద విద్యార్థులు కూడా ఆధు నిక విద్యను అందిపుచ్చు కుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో పలు మార్పులు తీసుకువచ్చి విద్యా వ్యవ స్థను ఆధునికీకరించేందు కు కృషి చేస్తున్నారని తెలి పారు. విద్య ద్వారానే కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయ ని, సమాజ అభివృద్ధికి కూడా విద్యే ప్రధాన ఆధా రమని పేర్కొన్నారు. కార్యకర్తకు పరామర్శ 2వ డివిజన్ కు చెందిన ఎలిసెల సురేష్ బాబు యాక్సిడెంట్‌కు గురై గాయాలతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకుని పార్టీ కార్యకర్త ఇంటికి గద్దె క్రాంతి కుమార్ వెళ్లి పరా మర్శించారు. వైద్య ఖర్చు ల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు దాసరి గాబ్రి యేలు, జెనసేన అధ్యక్షు లు ముత్యాల కృష్ణ కిషో ర్, మార్కెట్ యార్డ్ డైరె క్టర్ పర్వతనేని రత్నశ్రీ, సుగసాని కృష్ణ ప్రసాద్, నాళం నరేంద్ర, తెల్లా అప్పారావు, ఎలిసెల శేషు తదితరులు పాల్గొన్నారు.

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *