కరీంనగర్,mar 10, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘విద్యుత్ సవరణ బిల్లు-2025’ను వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (TSEJAC) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించి, బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. TSEJAC నాయకులు, వివిధ విభాగాల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని, కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
