మార్చి 10, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్కు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి మంత్రి లోకేష్ ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి. చంద్రకిరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియ, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
